దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగానే నమోదయ్యాయి. అలాగే వరుసగా 49వ రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 48,786 కేసులు, 1005 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,99,459 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అస్సాం, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్ గడ్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 61,588 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,94,88,918 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.97 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.31 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూన్ 30 8am–జూలై 1 8am):
- కేరళ – 13658
- మహారాష్ట్ర – 9771
- తమిళనాడు – 4506
- ఆంధ్రప్రదేశ్ – 3797
- కర్ణాటక – 3382
- ఒడిశా – 3371
- అస్సాం – 2479
- వెస్ట్ బెంగాల్ – 1478
- తెలంగాణ – 917
- ఛత్తీస్ గడ్ – 403
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ