అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మంగళవారం) దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా.. నారీ శక్తికి మరియు విభిన్న రంగాలలో వారు సాధించిన విజయాలకు నేను వందనం చేస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు ప్రధాని ట్విట్టర్ ద్వారా మహిళలకు తన సందేశాన్ని తెలిపారు. భారత ప్రభుత్వం.. గౌరవంతో పాటు విస్తృత అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆయన వెల్లడించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను ముందంజలో ఉంచడానికి తమ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.
On Women’s Day, I salute our Nari Shakti and their accomplishments in diverse fields. The Government of India will keep focusing on women empowerment through its various schemes with an emphasis on dignity as well as opportunity.
— Narendra Modi (@narendramodi) March 8, 2022
ఆర్థిక సమ్మేళనం నుండి సామాజిక భద్రత, నాణ్యమైన ఆరోగ్యం, గృహనిర్మాణం, విద్య, భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మా నారీ శక్తిని అగ్రగామిగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు రాబోయే కాలంలో మరింత శక్తివంతంగా కొనసాగుతాయి అని ప్రధాని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సాయంత్రం 6 గంటలకు కచ్లోని ధోర్డోలో మహిళా సెయింట్ క్యాంప్ సెమినార్లో ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ