తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ పై ఏప్రిల్ 16, గురువారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసుల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మౌలానా సాద్ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆయనకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
ముందుగా లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిజాముద్దీన్ మర్కజ్లో మతపరమైన కార్యక్రమం నిర్వహించడం వలన కొంతమంది కరోనా బారిన పడి మరణించడానికి కారణమయ్యారనే నేపథ్యంలో నిజాముద్దీన్ క్రైం బ్రాంచ్ పోలీసులు మౌలానా సాద్ పై కేసు నమోదు చేశారు. నిజాముద్దీన్ ఠాణా హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఆయనపై భారత శిక్షా స్మృతి సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu