దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఏప్రిల్ 17, శుక్రవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు నిర్ణయాలను వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొని ఉందన్నారు. తాజా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- భారత్ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్ అంచనా.
- జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికం.
- 2021, 2022 లో ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
- 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి పడిపోతుందని భావిస్తున్నారు.
- ఐఎంఎఫ్ ప్రకారం భారతదేశం ఈ ఆర్థిక సంవత్సరంలో 22 శాతం వృద్ధిని సాధించడం ద్వారా గొప్ప వృద్ధిని సాధిస్తుందని అంచనా.
- జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం.
- రెపో రేటు యథాతథంగా ఉంచాం.
- రివర్స్ రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింపు.
- కరోనా యొక్క ప్రభావం ఐఐపి ముద్రణలో కనుగొనబడలేదు, కాబట్టి ఆ డేటా ద్వారా తప్పుదారి పట్టొద్దు.
- 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే కూడా 34% ఎగుమతుల సంకోచం చాలా ఘోరంగా మారింది.
- సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్లు.
- మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్పీఏ గడువు వర్తించదు.
- రాష్ట్రాలకు 60శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు. సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలకు నిర్ణయం.
- జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10వేల కోట్లు.
- నాబార్డుకు రూ.25వేల కోట్లు.
- ఎటిఎంలు 91% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.
- లాక్ డౌన్ సమయంలో ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ లకు ఎలాంటి సమయ వ్యవధి లేదు
- బ్యాంకింగ్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతాయి.
- ఆర్ధిక వ్యవస్థలో తగినంతగా లిక్విడిటీ కొనసాగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu