మలయాళ అగ్ర హీరో, సీనియర్ నటుడు మోహన్లాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఒక మనీలాండరింగ్ కేసులో మాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్లాల్ను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పురాతన వస్తువుల మోసానికి పాల్పడిన మోన్సన్ మావుంగల్కు వ్యతిరేకంగా ఈ కేసులో విచారణ కోసం నటుడు మోహన్లాల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన వచ్చే వారంలో ఈడీ కొచ్చి ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అధికారులు అతనిని ప్రశ్నించే అవకాశం ఉంది.
గత ఏడాది సెప్టెంబర్లో ప్రజలను మోసం చేసి రూ.10 కోట్ల మేర మోసగించిన మోన్సన్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 52 ఏళ్ల యూట్యూబర్ను కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులను విక్రయించడం ద్వారా కోట్ల రూపాయలను మోసం చేశాడనే ఆరోపణలపై మోన్సన్ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అయితే కాలూర్లోని మోన్సన్ మావుంగల్ ఇంటిని మోహన్లాల్ సందర్శించినట్లు ఈడీకి సమాచారం అందింది. ఇదిలావుండగా, మోన్సన్ కేసులో విచారణకు ఐజీ లక్ష్మణ్ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర పోలీసు చీఫ్కు ఈడీ బుధవారం లేఖ రాసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ