దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఢిల్లీలో ఇప్పటికే 26,334 కరోనా కేసులు నమోదవగా, 10315 మంది కోలుకున్నారు, 708 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రధాన కార్యాలయంపై కూడా ఈ వైరస్ ప్రభావం పడింది. ఆరుగురు ఈడీ అధికారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యాలయాన్నీ రెండు రోజుల పాటుగా మూసివేస్తునట్టు ప్రకటించారు. ఈ రెండ్రోజుల పాటు కార్యాలయంలో శానిటైజేషన్ పనులు చేపట్టనున్నటు అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన మరో పది మంది అధికారులను కూడా క్వారంటైన్ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu