సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం నాడు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం తొమ్మిది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. అనంతరం 9 మందిని (హైకోర్టు చీఫ్ జస్టిస్/జడ్జి, బార్ మెంబెర్) సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమాకాలకై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తునట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు హైకోర్టు మహిళా జడ్జిలు ఉన్నారు.
సుప్రీంకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారి వివరాలు:
- జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా – చీఫ్ జస్టిస్ కర్ణాటక హైకోర్టు
- జస్టిస్ విక్రమ్నాథ్ – చీఫ్ జస్టిస్ గుజరాత్ హైకోర్టు
- జస్టిస్ జేకే మహేశ్వరి – చీఫ్ జస్టిస్ సిక్కిం హైకోర్టు
- జస్టిస్ హిమా కోహ్లి – చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు
- జస్టిస్ బీవీ నాగరత్న – జడ్జి కర్ణాటక హైకోర్టు
- జస్టిస్ సీటీ రవికుమార్ – జడ్జి కేరళ హైకోర్టు
- జస్టిస్ ఎంఎం సుందరేశ్ – జడ్జి మద్రాస్ హైకోర్టు
- జస్టిస్ బేలా ఎం.త్రివేది – జడ్జి గుజరాత్ హైకోర్టు
- పీఎస్ నరసింహ – సీనియర్ అడ్వకేట్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ