కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అనూహ్య మద్ధతు లభించింది. మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక రాజకీయ దిగ్గజం హెచ్.డి. దేవెగౌడ సీఎం కేసీఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని కె. చంద్రశేఖర రావు అద్భుత పోరాటం కొనసాగిస్తున్నందుకు అభినందనలు అని మాజీ ప్రధాని దేవెగౌడ వెల్లడించారు. దేశంలోని ‘లౌకికవాదం, విభిన్న సంస్కృతి’ పరిరక్షణ కోసం పోరాడుతున్నందుకు కేసీఆర్కు దేవెగౌడ అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు దేవెగౌడ ఫోన్ చేసి ప్రత్యేకంగా ముచ్చటించారు.
దేవెగౌడ మాట్లాడుతూ.. ”రావ్ సాబ్, మీరు చాలా బాగా పోరాడుతున్నారు. పెద్ద యుద్దమే చేస్తున్నారు.. మతతత్వ అంశాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా వుంటాం… మీ యుద్దాన్ని కొనసాగించండి.. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది” అని తెలిపారు. కాగా, దీనికి ప్రతిగా ఈ విషయంపై చర్చించేందుకు తాను బెంగళూరుకు వచ్చి వ్యక్తిగతంగా కలుస్తానని దేవెగౌడకు కేసీఆర్ బదులిచ్చారు. కాగా, సీఎం కేసీఆర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటిని ఏకం చేయటానికి ప్రణాళికలు రచిస్తున్నారని చర్చ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే సీఎం కేసీఆర్కు దేవెగౌడ మద్దతు తెలపటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ