దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యంలో రోజువారీగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు. అలాగే కరోనా పాజిటివ్ గా తేలడంతో తన ఆరోగ్యం గురించి వాకబు చేసి, త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలకు తెలిపిన అందరికీ కేంద్రమంత్రి ఎస్.జై శంకర్ ధన్యవాదాలు తెలిపారు.
Have tested Covid positive.
Urge all those who have come in recent contact to take suitable precautions.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 27, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ