పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ), బీజేపీ పార్టీల్లోకి పలువురు ప్రముఖులు, నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అధికార టీఏంసీకు చెందిన నాయకులు సహా సినీ, క్రీడా ప్రముఖులు కూడా బీజేపీలో పెద్దఎత్తున చేరుతున్నారు. ప్రముఖ నటుడు యశ్ దాస్ గుప్తా, మాజీ క్రికెటర్ అశోక్ దిండా ఇప్పటికే బీజేపీ లోకి చేరగా తాజాగా ఆ జాబితాలోకి ప్రముఖ బెంగాలీ నటి పాయల్ సర్కార్ చేరారు.
నటి పాయల్ సర్కార్ గురువారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలిప్ ఘోష్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ బెంగాల్ ప్రజల కోసం బీజేపీ ఎంతో కష్టపడుతుందని, అందులో భాగంగా వారితో కలిసి బెంగాల్ ప్రజల కోసం పనిచేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. మరోవైపు బుధవారం నాడు క్రికెటర్ మనోజ్ తివారీ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సమక్షంలో టీఏంసీలో చేరిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ