వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అయితే జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో చోటుచేసుకున్న హింస, ఉద్రిక్త పరిణామాలతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారాయి. సింఘు, టిక్రి, ఘాజీపూర్ ప్రాంతాల్లో రైతులు ఉద్యమం చేస్తున్న చోట పోలీసు బలగాలతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను అదుపులో ఉంచుతూ, భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ముందుగా సింఘు, ఘాజిపూర్ మరియు టిక్రి వాటి పరిసర ప్రాంతాలలో జనవరి 29 రాత్రి 11 గంటల నుండి జనవరి 31 రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా తాజాగా ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31 రాత్రి 11 గంటల నుంచి ఫిబ్రవరి 2 రాత్రి 11 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ