ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)కు షాక్ తగిలింది. ఏఐఎఫ్ఎఫ్పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) మంగళవారం ప్రకటించింది. ‘అనవసరమైన థర్డ్ పార్టీల (బయటి వ్యక్తుల) జోక్యం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ‘ఫిఫా కౌన్సిల్ బూరో’ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. సస్పెన్షన్ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్న ఫిఫా, ఈ క్రమంలో ఏఐఎఫ్ఎఫ్ తన రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకు ఏఐఎఫ్ఎఫ్పై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపిన ఫిఫా, ఈ విషయంపై ‘ఫిఫా కౌన్సిల్ బ్యూరో’ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపింది.
ఫిఫా తాజా నిర్ణయంతో ముగ్గురు సభ్యుల ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయని, ఏఐఎఫ్ఎఫ్పై పాలక మండలి తిరిగి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. అలాగే ఈ విషయాన్ని క్రీడల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామని ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. ఇక ఏఐఎఫ్ఎఫ్ రాజ్యాంగాన్ని సవరించడానికి సుప్రీం కోర్టు మే నెలలో ఏఐఎఫ్ఎఫ్ని రద్దు చేసింది. ఈ క్రమంలో 18 నెలలుగా పెండింగ్లో ఉన్న ఎన్నికలను నిర్వహించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఫిఫా సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్లో జరగాల్సిన ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై నీలినీడలు కమ్ముకొన్నాయి. భారత్ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశాలను పరిశీలించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY