తమిళనాడులో బాణాసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి, 36 మందికి గాయాలు

Fire Breaks Out at Firecracker Factory in Virudhunagar Tamil Nadu 11 Dead,Mango News,Mango News Telugu,Fire breaks out at firecracker factory in Tamil Nadu,TN: Fire erupts at firecracker factory in Virudhunagar,11 Dead in Fire at Cracker Factory in Tamil Nadu,16 killed in Tamil Nadu fireworks unit blaze,11 killed in fire in Tamil Nadu cracker factory

తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్‌నగర్‌ జిల్లాలోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 36 మంది గాయపడినట్టు తెలిపారు. ఈ ఘటనపై ‌సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్క‌డికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కర్మాగారంలో పెద్దఎత్తున వ్యాపించిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఇక బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, రసాయనాలు కలుపుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష ఎక్స్‌గ్రేషియాను సీఎం పళనిస్వామి ప్రకటించారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అందించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =