మహరాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 10 మంది కరోనా బాధితులు మరణించారు. అలాగే ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయానికి ఐసీయూలో 25 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ఈ ప్రమాదఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో 10 మంది కరోనా పేషంట్స్ మరణించడం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించాలని అధికారులను సీఎం ఉద్ధవ్ థాకరే ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ