రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కన్హయ్య కుమార్

Former CPI Leader Kanhaiya Kumar Joined the Congress Party in the Presence of Rahul Gandhi,Mango News,Mango News Telugu,Former CPI Leader Kanhaiya Kumar,Kanhaiya Kumar,Congress,Congress Party,Rahul Gandhi,Kanhaiya Kumar Joined the Congress Party,Kanhaiya Kumar Joins Congress In Presence Of Rahul Gandhi,Kanhaiya Kumar Joins Congress In Presence Of Rahul Gandhi,Kanhaiya Kumar Joins Congress,Kanhaiya Kumar Latest News,Kanhaiya Kumar News,Kanhaiya Kumar Live Updates,Kanhaiya Kumar Congress Party,Kanhaiya Kumar Speech

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ సీపీఐ నేత కన్హయ్య కుమార్ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. కొన్ని టెక్నికల్ కారణాల దృష్ట్యా ప్రస్తుతం అధికారికంగా కాంగ్రెస్ లో చేరడం లేదని పేర్కొన్నారు. తానూ సైద్ధాంతికంగా కాంగ్రెస్‌లో భాగమవుతున్నానని, రాబోయే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు నుంచే పోటీలో ఉంటానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిక అనంతరం కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవానీ, కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ, కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరడం పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహన్నీ కలిగిస్తుందని చెప్పారు. కన్హయ్య కుమార్ మాట్లాడుతూ, దేశాన్ని రక్షించాల్సి వస్తే, కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలని భావిస్తున్నానని, అందుకోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ మనుగడ కోనసాగిస్తే, అన్ని ఇతర చిన్న పార్టీలు కూడా మనుగడ సాగిస్తాయన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 2 =