దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “వేరే పని నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినపుడు కరోనా పాజిటివ్ గా తేలింది. గతవారం రోజుల్లో నాతో సంప్రదించిన వ్యక్తులంతా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ, పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని” ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. మరోవైపు ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 22,15,074 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu