హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి-2 లో భాగంగా రూ.26.45 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్గూడ కుడివైపు ఫ్లైఓవర్ను రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగస్టు 10, సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో బైరామల్గూడ జంక్షన్, సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, డిప్యూటి కమిషనర్ విజయ్కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu