గోవా ముఖ్యమంత్రి డా.ప్రమోద్ సావంత్ శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో గోవా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రమోద్ సావంత్ చర్చించారు. సీఎం ప్రమోద్ సావంత్ ఇటీవలి కాలంలో ఢిల్లీ పర్యటనకు రావడం ఇది రెండోసారి. ప్రధానితో భేటీపై ప్రమోద్ సావంత్ ట్వీట్ చేస్తూ ఈ సమావేశంలో తాను పలు అంశాలపై చర్చించానని, గోవా అభివృద్ధికి ప్రధాని నుంచి మార్గదర్శకత్వం కోరినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో గోవా రాష్ట్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రాగా, ప్రమోద్ సావంత్ కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ