విధుల నిర్వహణలో ఉన్న ఒక పోలీసు మహిళపై దాడి చేసిన కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాంలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ట్వీట్ల కేసులో అసోం లోని మరో కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏప్రిల్ 25న మేవానీని ఈ కేసులో మళ్లీ అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసు మహిళపై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అసోం కోర్టు నుండి బెయిల్ పొందారు. మహిళా పోలీసు అధికారి నమ్రతపై ఎమ్మెల్యే జిగ్నేష్ దాడి చేసి దౌర్జన్యం చేశారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. కాగా అసోం లోని కోక్రాజార్కు చెందిన స్థానిక బిజెపి నాయకుడు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో.. మేవానీని అస్సాం పోలీసుల బృందం గుజరాత్లోని పాలన్పూర్ నుండి గత గురువారం మొదటిసారి అరెస్టు చేసింది. ఈ సందర్భంగా జిగ్నేశ్ మాట్లాడుతూ.. “ఇది బిజెపి, ఆర్ఎస్ఎస్ల కుట్ర. నా ప్రతిష్టను దిగజార్చేందుకే వారు ఇలా చేశారు. పథకం ప్రకారమే వారు ఇలా చేస్తున్నారు. రోహిత్ వేములకి చేశారు, చంద్రశేఖర్ ఆజాద్కి చేసారు, ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ