దేశంలో జనవరి నెలలో రికార్డ్ స్థాయిలో దాదాపు లక్ష 20 వేల కోట్ల వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జనవరి నెలలో మొత్తం రూ.1,19,847 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని, గత డిసెంబర్ లో వసూలైన రూ.1.15 లక్షల కోట్లను దాటి జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత భారీగా వసూలు కావడం ఇదే తొలిసారని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు.
అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.21,923 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ. 29,014 కోట్లు, ఐజీఎస్టీ రూ.60,288 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.22,078 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి 8,622 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.883 కోట్లతో కలిపి) వసూలు అయ్యాయి. గత నాలుగు నెలలగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటుతున్నాయని, అయితే జీఎస్టీ ఆదాయం పెరగడం కరోనా మహమ్మారి పరిస్థితుల అనంతరం దేశంలో వేగంగా మారుతున్న ఆర్థిక రికవరీకి స్పష్టమైన సూచికని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ