ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కేసులు విజృంభణతో చాలా దేశాలు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. కాగా ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో కొత్తగా ఒకే ఒక్క కరోనా కేసు నమోదు కావడంతో ఐదురోజుల పాటుగా లాక్డౌన్ విధించారు. పెర్త్ నగరంలోని ఓ క్వారంటైన్ హోటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో అక్కడి అధికారులు అప్రమత్తమై, ఆప్రాంతంలోని సుమారు 20 లక్షల మంది నివాసితులని ఇంట్లోనే ఉండాలని, లాక్డౌన్ ఆంక్షలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలను కేవలం వ్యాయామం, వైద్య సంరక్షణ, అవసరమైన పని లేదా ఆహారం తెచ్చుకునేందుకు మాత్రమే ఇళ్లలోంచి బయటకు రావడానికి అనుమతి ఇస్తున్నారు. చాలా త్వరగా, కఠినంగా వ్యవహరించడం ద్వారానే ఈ వైరస్ ను అదుపు చేయగలమని పేర్కొన్నారు. క్వారంటైన్ హోటల్ కు వచ్చిన ప్రయాణికుడి ద్వారానే సెక్యూరిటీ గార్డుకు వైరస్ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ