గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 2 దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు (డిసెంబర్ 8, గురువారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 37 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఎంఐఎం సహా పలు పార్టీలు పోటీలో ఉన్నాయి. అయితే ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తుంది. ప్రస్తుత ఫలితాల సరళిని గమనిస్తే గుజరాత్ లో బీజేపీ మళ్ళీ అధికారం దక్కించుకునే దిశగా వెళ్తుంది.
బీజేపీ 152 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు మరింత ప్రభావం చూపుతాయని ముందుగా భావించినప్పటికీ, ఫలితాల్లో మరోసారి బీజేపీ హవా కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సొంతరాష్ట్రమైన గుజరాత్ లో మరోసారి బీజేపీనే విజయం వరించనుంది. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు కీలక నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను అక్కట్టుకుని విజయం దిశగా నడిపించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (182): (ఆధిక్యం)
- బీజేపీ: 152
- కాంగ్రెస్+ ఎన్సీపీ: 19
- ఆప్: 6
- ఇతరులు: 5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE