హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాగా ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 32 స్థానాల్లో, ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభావం చూపుతుందని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు.
హిమాచల్ ప్రదేశ్ మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ అయినా 35 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కౌంటింగ్ సరళిని గమనిస్తే హిమాచల్ లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దక్కించుకుంటుందో అంతుచిక్కడం లేదు. కౌంటింగ్ ముగిసేసరికి బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీగా సీట్లు గెలుచుకుంటే, ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్స్/ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాగా బీజేపీ లేదా కాంగ్రెస్ ఏదైనా మ్యాజిక్ మార్క్ అందుకుంటుందేమో మరికొద్ది గంటల్లో తేలనుంది.
మొత్తం 12 జిల్లాల్లోని 68 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 59 చోట్ల 68 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సహా పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంది, మిగతా పార్టీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (68): (ఆధిక్యం)
- బీజేపీ: 32
- కాంగ్రెస్: 32
- ఆప్: 0
- ఇతరులు: 4
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE