గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు, విస్తృతంగా ప్రచారం

Gujarat Assembly Elections-2022: A Total Of 1621 Candidates Contesting For 182 Constituencies,Gujarat Assembly Elections-2022, Total 1621 Candidates In The Fray, Extensive Campaigning,Gujarat Assembly Elections,Gujarat Assembly Elections,Pm Modi Election Campaign In Gujarat, Congress Insults Tribals, Mocked Me For Wearing Tribal Attire,Narendra Modi,Gujarat , Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Pm Narendra Modi, Modi Latest News And Updates,Gujarat Assembly News And Live Updates,Mango News,Mango News Telugu

గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1న 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో భాగంగా డిసెంబర్ 5న 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దశలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. అధికార బీజేపీ 182 స్థానాల్లో అభ్యర్థులను బరిలో ఉంచింది. కాంగ్రెస్ పార్టీ 179 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో ఉంచి, పొత్తులో భాగంగా ఎన్సీపీకి మూడు సీట్లను కేటాయించగా, దేవ్‌గఢ్ బరియా స్థానంలో ఎన్సీపీ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా 182 స్థానాల్లో నామినేషన్స్ వేయగా, సూరత్ ఈస్ట్ లో ఆప్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో 181 స్థానాల్లో పోటీలో ఉంది. ఇక ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థులు 13 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉన్నారు.

గుజరాత్ రాష్ట్రంలో సాధారణ ఓటర్లు సంఖ్య 4,90,89,765, సర్వీస్ ఓటర్ల సంఖ్య 27,943 కలిపి మొత్తం 4,91,17,308 ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51,782 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. డిసెంబర్ 1న తొలి దశలో పోలింగ్‌ జరగనున్న 89 స్థానాలకు గానూ 788 మంది అభ్యర్థులు, డిసెంబర్ 5న రెండో దశలో ఎన్నికలు జరగనున్న 93 స్థానాలకు గానూ 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను డిసెంబర్ 8వ తేదీన చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. మరోవైపు గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్,ఆప్ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బాఘేల్, అలాగే ఆప్ నుంచి ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తదితరులు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =