గుజరాత్ రాష్ట్రంలో కొనసాగుతున్న తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Gujarat Assembly Elections Phase-1 Voting underway in 89 Constituencies,Gujarat Assembly Elections Phase-1,Gujarat Assembly Elections Voting,Gujarat Assembly Polls,Gujarat Assembly,PM Modi Road Show in Ahmedabad,Gujarat Assembly Elections,Congress Chief Mallikarjun Kharge,Mango News,Mango News Telugu,Prime Minister Narendra Modi, Narendra Modi News and Updates,PM Modi Latest News and Updates,PM Modi,Prime Minister Modi,Indian Prime Minister Modi Latest News and Updates, Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Gujarat Assembly News And Live Updates,

గుజరాత్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గురువారం తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. గురువారం ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కాగా తోలి దశ పోలింగ్ లో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

పోలింగ్ పక్రియ కోసం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 4.92 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు 2,20,288 మంది శిక్షణ పొందిన అధికారులు, ఉద్యోగులతో పాటుగా 27,978 మంది ప్రిసైడింగ్ అధికారులు, 78,985 మంది పోలింగ్ అధికారులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దక్షిణ గుజరాత్‌, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో గురువారం పోలింగ్ జరుగుతుంది.

గుజరాత్ బీజేపీ చీఫ్ సిఆర్ పాటిల్, గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి, బీజేపీ నేత, కేంద్ర మంత్రి పర్షోత్తమ్ రూపాలా, క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆయన సతీమణి, బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “నేడు గుజరాత్ ఎన్నికల తొలి దశ పోలింగ్. ఈరోజు ఓటు వేస్తున్న వారందరికీ, ప్రత్యేకించి మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నాను” అని పేర్కొన్నారు.

గుజరాత్ లో ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే కీలక పోటీ నెలకుంది. తోలి దశలో పోలింగ్ జరగనున్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ విస్తృత ప్రచారం నిర్వహించాయి. తోలి దశ పోలింగ్‌లో గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ, కున్వర్జీ బవలియా, కాంతిలాల్ అమృతియా వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. ఇక గుజరాత్ లో రెండో దశలో భాగంగా 93 స్థానాలకు గానూ డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, మొత్తం ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + two =