గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు: నేడు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో, రెండో దశ పోలింగ్‌కు ప్రచారం

Gujarat Assembly Polls PM Modi To Lead Longest Road Show Ever in Ahmedabad During Election Campaign Today,Gujarat Assembly Polls,Gujarat Assembly,PM Modi Road Show in Ahmedabad,Gujarat Assembly Elections,Congress Chief Mallikarjun Kharge,Mango News,Mango News Telugu,Prime Minister Narendra Modi, Narendra Modi News and Updates,PM Modi Latest News and Updates,PM Modi,Prime Minister Modi,Indian Prime Minister Modi Latest News and Updates, Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Gujarat Assembly News And Live Updates,

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 89 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో దశ ఎన్నికలు జరుగనున్న ప్రాంతాలలో ఈరోజు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ మరియు సూరత్‌లలో ప్రధాని మోదీ భారీ రోడ్ షోలో పాల్గొననున్నారు. దాదాపు 50 కి.మీ దూరం సాగనున్న ఈ రోడ్ షోలో ఆయన సుమారు 16 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఇంత సుదీర్ఘ రోడ్ షో జరుగలేదని, ఇదే మొదటిసారని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. అహ్మదాబాద్‌లోని అన్ని స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రచారం తమ అభ్యర్థులకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3:30 గంటలకు మోదీ రోడ్‌షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఈ సాయంత్రం 6:30 గంటల వరకు కనీసం 35 చోట్ల ఆయన ఆగి ప్రసంగిస్తారని వారు తెలిపారు.

అలాగే దారి మధ్యలో పండిట్ దిండయాళ్ ఉపాధ్యాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖుల స్మారక చిహ్నాల వద్ద కూడా ప్రధాని మోదీ ఆగాలని భావిస్తున్నారని బీజేపీ నేతలు వెల్లడించారు. ఇక ఈ రోడ్‌షో ‘నరోదా గాం’ నుంచి ప్రారంభమై గాంధీనగర్ సౌత్ నియోజకవర్గం వద్ద 50 కిలోమీటర్లకు పైగా సాగుతుందని బీజేపీ తెలియజేశారు. తద్వారా థక్కర్‌బాపానగర్, బాపునగర్, నికోల్, అమ్రైవాడి, మణినగర్, డానిలింబ్డా, జమాల్‌పూర్ ఖాడియా, ఎలిస్‌బ్రిడ్జ్, వేజల్‌పూర్, ఘట్లోడియా, నారన్‌పూర్, సబర్మతి తదితర బీజేపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. కాగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 5న రెండో విడత ఓటింగ్ తర్వాత డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =