ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. నాగాలాండ్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) కూటమి ఇప్పటికే 35 స్థానాల్లో విజయం సాధించి, మ్యాజిక్ ఫిగర్ సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్సీపీ పార్టీ 5 స్థానాలు, ఎన్పీపీ 4, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా 2, ఎల్జేపీ (రామ్ విలాస్) 1, ఎన్పీఎఫ్ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. కాగా నాగాలాండ్ లోని ఆకులిటో నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో, పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో పోలింగ్ కు ముందే బీజేపీ ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకుంది.
నాగాలాండ్ సీఎం నీఫియు రియో ఉత్తర అంగామి-2 స్థానం తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సెయివిల్లే సచు పై 15,824 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే నాగాలాండ్ అసెంబ్లీకి మొదటిసారిగా ఇద్దరూ మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎన్డీపీపీకి చెందిన హేకానీ జఖాలు దిమాపూర్ స్థానం నుంచి గెలుపొంది, నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నుకోబడిన మొదటి మహిళగా నిలిచారు. అలాగే పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి సాల్వోతునో క్రుసే కూడా విజయం సాధించారు.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (60): (గెలుపు+ఆధిక్యం)
- బీజేపీ: 12
- ఎన్డీపీపీ: 25
- ఎన్సీపీ: 7
- ఎన్పీపీ: 5
- రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే): 2
- ఎల్జేపీ (రామ్ విలాస్): 2
- ఎన్పీఎఫ్: 2
- ఇండిపెండెంట్: 4
- జేడీయూ : 1
- కాంగ్రెస్: 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE