భారత్ లో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు హాంకాంగ్ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు 14 రోజుల పాటుగా భారత్ నుంచి వచ్చే ప్యాసింజర్ విమాన సర్వీసులను నిషేధించనున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే విమానాలపై కూడా నిషేధం విధించారు. ఈ మూడు దేశాల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉండడంతో హై రిస్క్ గా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కరోనావ్యాప్తి నేపథ్యంలో గతఏడాది కూడా ఎయిర్ ఇండియా విమానాలు మరియు విస్తారా విమానాల యొక్క కార్యకలాపాలపై పలుసార్లు హాంకాంగ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ