ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 5963 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 19, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000 కు చేరింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1182, గుంటూరులో 938, శ్రీకాకుళంలో 893, తూర్పుగోదావరిలో 626, విశాఖపట్నంలో 565 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 2569 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కృష్ణాలో ఆరుగురు, చిత్తూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరు, కడప, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, మరియు అనంతపూర్ లో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7437 కి పెరిగింది. గత 24 గంటల్లో 37,765 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,57,15,757 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 19, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,68,000
- కొత్తగా నమోదైన కేసులు : 5963
- కొత్తగా నమోదైన మరణాలు : 27
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 9,12,510
- యాక్టీవ్ కేసులు : 48053
- మొత్తం మరణాల సంఖ్య : 7437
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ