కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మాస్కు ధరించడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లోప్రతి ఒక్కరూ ఫేస్ కవర్ / మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ, ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.1000/- జరిమానా విధిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ నగరాల్లో, పట్టణాల్లో కొంతమంది ప్రజలు ముఖానికి మాస్కులు లేకుండా బయట తిరుగుతుండడంతో వాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
కృత్రిమ మేథ (AI) టెక్నాలజీ ద్వారా సీసీటీవీ నిఘా కెమెరాలపై కంప్యూటర్ విజన్ మరియు డీప్లెర్నింగ్ టెక్నిక్ అమలు చేసి మాస్కులు ధరించని వ్యక్తులను గుర్తించనున్నట్టు తెలిపారు. ఈ తరహా వినూత్న సాంకేతిక పరిజ్ఞనాన్ని దేశంలోని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించబోతున్నట్టు తెలిపారు. అతి త్వరలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
#AI based #FaceMaskViolationEnforcement is being rolled out by TS police.
Leveraging ComputerVision & #DeepLearningTechnique being implemented on surveillance CCTVs across the cities is #FirstOfItsKind in INDIA.
Shall be enabled shortly across the 3Commissionerates
*Hyd,Cyb&Rck. pic.twitter.com/hGwvq9cvsE— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 8, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu