ఐసీసీ బుధవారం టీ-20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈరోజు విడుదల చేసిన ఐసీసీ T-20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 4స్థానంలో నిలిచాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 10వ మరియు 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్స్ బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే, బౌలింగ్ ర్యాంకింగ్స్లో.. శ్రీలంకకు చెందిన వణిందు హసరంగ మొదటి స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 20వ స్థానంలో నిలిచాడు. టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు స్థానాలు వెనుకబడి 26వ స్థానంలో నిలిచాడు.
అయితే ఇటీవల టీ20 ఇంటర్నేషనల్స్లో టీమిండియా ఆడలేదు. బ్రిడ్జ్టౌన్లో ఇంగ్లండ్తో జరిగిన 5వ మ్యాచ్ లో వెస్టిండీస్ను 17 పాయింట్ల తేడాతో నిర్ణయాత్మక విజయం సాధించడంలో సహాయపడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకిల్ హొస్సేన్ మరియు ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్ కెరీర్ హై బౌలింగ్ ర్యాంకింగ్స్కు చేరుకున్నారు. హుస్సేన్ 15 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ హోల్డర్.. చివరి మ్యాచ్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF