క్వాలిఫయర్స్లో నమీబియాతో శ్రీలంక స్క్వేర్ చేయడంతో టీ20 ప్రపంచకప్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ ముందు ఐసీసీ ఆధ్వర్యంలో కెప్టెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నీలో పాల్గొనే 16 జట్ల కెప్టెన్లందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. అలాగే కెప్టెన్లందరూ సెల్ఫీలతో సందడి చేశారు. ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఒకే ఫ్రేమ్లో ఉన్న కెప్టెన్లందరి చిత్రాన్ని షేర్ చేసింది. అనంతరం ప్రపంచ కప్కు వారు ఎలా సన్నద్ధమయ్యారో మీడియాకు వివరించారు. ఇక అక్టోబర్ 22న న్యూజిలాండ్తో ఆస్ట్రేలియాతో సూపర్ 12 దశ ప్రారంభమవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికాలు తమ మ్యాచ్లను సూపర్ 12 స్టేజ్ నుంచి ప్రారంభించనున్నాయి. అక్టోబర్ 23న, చిరకాల ప్రత్యర్థులు భారత్ మరియు పాకిస్థాన్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తలపడనున్నాయి. అలాగే ఫస్ట్ రౌండ్లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. ఇక మొత్తం ప్రైజ్ మనీ 5.6 మిలియన్లు కాగా.. టైటిల్ గెలిచిన జట్టు 1.6 మిలియన్ యూఎస్ డాలర్లు సొంతం చేసుకుంటుందని, రన్నర్-అప్ జట్టు 8,00,000 డాలర్లు, అలాగే ఓడిన సెమీ-ఫైనలిస్ట్లు ఒక్కొక్కరికి USD 400,000 అందుకుంటారని ఇప్పటికే ఐసీసీ ప్రకటించడం తెలిసిందే. అక్టోబర్ 16 నుండి ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలలో జరుగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY