దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 2,430 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 15, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,26,427 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 17 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,874 కి పెరిగింది. ఇక అక్టోబర్ 14, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.83 (89,83,57,195) కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 14న 2,41,707 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
దేశంలో 26,618 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం:
దేశంలో ప్రస్తుతం 26,618 (0.06%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,378 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,70,935 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తెలంగాణ, ఒడిశా, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY