భారత మాజీ నౌకాదళ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. 2016, మార్చి 3 న పాకిస్తాన్ భద్రతా దళాలకు కుల్ భూషణ్ జాదవ్ చిక్కాడు, ఆ తరువాత గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్ లో మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం జేస్తూ, పాక్ వైఖరి పై 2017 మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అభ్యర్థన స్వీకరించిన ఐసిజే తాము తదుపరి తీర్పు ఇచ్చేంతవరకు మరణ శిక్షను నిలిపివేయాలని పాకిస్తాన్ ను ఆదేశించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం ఈ కేసులో విచారణ నిర్వహించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల వాదనలు విని కీలక ఆధారాలను సేకరించింది. ఈ తీర్పు ది హేగ్ కాలమానం ప్రకారం బుధవారం 3 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు వెలువడనుంది. హేగ్ లో శాంతి సౌధంలో తీర్పు వెలువరించనున్నారు,ఈ నేపథ్యంలో పాక్ న్యాయవాదులు, భారత బృందం అక్కడికి చేరుకున్నారు. ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అని ఇరు దేశాలు ఎదురుచూస్తున్నాయి.
[subscribe]
[youtube_video videoid=uPKblPRj3fY]