ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టులో ఛటేశ్వర్ పుజారా, శుభమన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగాడు. అలాగే మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లతో బౌలింగ్ కాంబినేషన్ సమకూర్చగా, ఆల్ రౌండర్ గా జడేజా తుదిజట్టులో ఉన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ తుది జట్టులోకి బెన్ ఫోక్స్, జామీ ఓవర్టన్ స్థానంలో జేమ్స్ ఆండర్సన్, సామ్ బిల్లింగ్స్ వచ్చినట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మకమైన ఈ 5వ టెస్టులో భారత్ జట్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ని వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ గా తేలడంతో భారత్ టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. తోలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతానికి రెండు వికెట్స్ కోల్పోయి 53 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (1), హనుమ విహారి (14) పరుగులతో క్రీజులో ఉండగా, ఛటేశ్వర్ పుజారా 13, శుభమన్ గిల్ 17 పరుగులకు పెవిలియన్ బాట పట్టారు.
భారత్ జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్) శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY