నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు ఆదాయపు పన్నుశాఖ (ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ – ఐటీ) షాకిచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తులు, ఆదాయాలపై ఈ నోటీసులు జారీ చేసినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. గడచిన 10 రోజులుగా అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం నిన్న ఒక కొలిక్కి వచ్చింది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నాటకీయ పరిణామాలకు ముగింపు పడినట్లయింది. అయితే బీజేపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పరిచిన షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్క రోజు కూడా గడవక ముందే శరద్ పవార్కు ఐటీ నోటీసులు అందడం విశేషం. దీనిపై స్పందించిన పవార్.. ఐటీ శాఖ నుంచి ‘ప్రేమ లేఖ’ అందిందని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక దీనిపై స్పందించిన శరద్ పవార్.. ఐటీ శాఖ నుంచి ‘ప్రేమ లేఖ’ అందిందని సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఆదాయపు పన్ను శాఖ నుంచి నాకు నిన్న నోటీసు వచ్చింది. ఇది భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు పంపబడింది. 2020, 2014 మరియు 2009-10 సంవత్సరాల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో నేను పంచుకున్న ఆస్తుల వివరాలకు సంబంధించిన సమాచారం మరియు వివరణను వారు కోరారు. త్వరలో సుప్రియాకి కూడా ఇలాంటి నోటీసు వచ్చే అవకాశం ఉందని విన్నాను. దాడులు వంటి వాటి గురించి కూడా హెచ్చరించినందున నేను వెంటనే నోటీసుపై స్పందించాల్సి ఉంటుంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరియు అతని కుమారుడు ఆదిత్య ఠాక్రేకి కూడా ఇలాంటి నోటీసులు అందజేసినట్లు నేను విన్నాను’ అని విలేకరులతో అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ