దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 699 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 21, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,97,037 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన మరో రెండు మరణాలు (రాజస్థాన్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,708కి పెరిగింది.
అలాగే మరో 435 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,59,617 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.79 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 6,559 (0.01%) కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 97,866 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.71 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE