దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,046 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,54,638 కు చేరుకుంది. అలాగే 53 కరోనా మరణాలు నమోదుకావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,29,077 కు పెరిగింది. గోవా, కేరళ రాష్ట్రాల్లో కరోనా మరణాల సవరణ నేపథ్యంలో తాజా మరణాల సంఖ్య పెరిగింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 213, మహారాష్ట్రలో 169, తమిళనాడులో 152, కర్ణాటకలో 83 నమోదయ్యాయి. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 69, ఆంధ్రప్రదేశ్ లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 1, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 90,10,93,208
- అక్టోబర్ 31న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,27,126
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 31–నవంబర్ 1 (8AM-8AM)] : 1,046
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,54,638
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 1,287
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,07,943
- కరోనా రికవరీ రేటు : 98.78 శాతం
- యాక్టీవ్ కేసులు : 17,618 (0.04 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 53
- మొత్తం మరణాల సంఖ్య : 5,29,077
- కరోనా మరణాల రేటు: 1.18 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE