దేశంలో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మొత్తం 1,63,342 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 89 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మార్చి 2020 నుండి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదవడం ఇదే. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.05 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,81,243 కు చేరుకుంది. అలాగే కరోనా వలన ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530726 గా ఉంది.. అలాగే 163 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,48,472కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
కాగా ప్రస్తుతం దేశంలో 2,035 (0.01%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొంత ఎక్కువుగా నమోదు అయ్యాయి. అయితే ఏ రాష్ట్రంలో కూడా 40కి పైన కరోనా కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (జనవరి 16 (8am)–జనవరి 17 (8am)):
- కేరళ – 32
- కర్ణాటక – 24
- మహారాష్ట్ర – 10
- తమిళనాడు – 7
- పంజాబ్ – 6.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE