దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కరోనా పాజిటివ్ కేసులు మరోసారి 17 వేలకు పైగానే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 17,135 పాజిటివ్ కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 3, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,40,67,144 కు, మరణాల సంఖ్య 5,26,477 కి పెరిగిందని తెలిపారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 4,64,919 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 87.63 కోట్లు (87,63,57,530) దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 3.69 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 4.67 శాతంగా ఉంది.
అలాగే గత 24 గంటల వ్యవధిలో 19,823 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,34,03,610 కు చేరుకుంది. తాజాగా నమోదైన కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువుగా ఉంది. కరోనా రికవరీ రేటు 98.49 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 1,37,057 (0.31%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY