దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సోమవారం ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమె అనారోగ్య సమస్యలు మరియు తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో నేడు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఉమామహేశ్వరి సోదరి అన్న సంగతి తెలిసిందే.
అలాగే నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర సోదరులు, వారి కుటుంబ సభ్యులు అనేకమంది హాజరయ్యారు. ఉమామహేశ్వరి మరో సోదరి, మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. అయితే సోదరి మరణంతో తీవ్ర దు:ఖంలో ఉన్న బాలకృష్ణ సహా మిగిలిన సోదరులు ముందుగా ఆమె పాడె మోయగా.. అనంతరం పార్ధివదేహాన్ని అంతిమయాత్ర వాహనంలోకి ఎక్కించారు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు చేరుకోగా.. కడసారి ఆమెను చూసేందుకు బంధువులు, నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతిమ సంస్కారం భాగంగా ఉమామహేశ్వరి చితికి ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY