దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మరో 326 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,88,693కు చేరుకుంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,775 గా ఉంది. కాగా మార్చి 7న 63,085 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.52 శాతంగా నమోదైంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 80, కర్ణాటకలో 64, కేరళలో 55, తమిళనాడులో 28, గుజరాత్ లో 25 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, మార్చి 8, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 91,93,78,014
- మార్చి 7న నిర్వహించిన కరోనా పరీక్షలు : 63,085
- కొత్తగా నమోదైన కేసులు [మార్చి 7–మార్చి 8(8AM-8AM)] : 326
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,88,693
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 220
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,54,842
- కరోనా రికవరీ రేటు : 98.80 శాతం
- యాక్టీవ్ కేసులు : 3,076
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,775
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE