అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా మహిళలందరికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చట్ట సభల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “శక్తి స్వరూపిణి స్త్రీ..బహుకృత రూపిణి స్త్రీ..బహుముఖ ప్రజ్ఞాశాలి స్త్రీ..మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ..ఇంతటి మహోన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది. తల్లిగా, తోబుట్టువుగా, భార్యగా..బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెల కట్టలేనివి. మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిది. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటాము. అది సత్యం. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లతాయని నేను ధృడంగా విశ్వసిస్తాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
“అయితే స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి. స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడలన్నా, సాధికారిత సాధించాలన్నా చట్ట సభలలో వారి సంఖ్యా బలం పెరగవలసి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేయడంతో పాటు ఈ అంశాన్ని మా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన విషయం ఆడపడుచులు అందరికీ విదితమే. ఈ దిశగా నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందని మీకు సవినయంగా విన్నవిస్తూ మహిళామణులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE