కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 50,812 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,31,945 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 53,191 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 47,649 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 55,41,834 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 3,36,202 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 60874 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 46202, కోజికోడ్ లో 31595, కొల్లంలో 27595, త్రిస్సుర్ లో 26171, కొట్టాయంలో 23744, పాలక్కాడ్ లో 21390, మలప్పురంలో 20220, అలపుజాలో 16632, ఇడుక్కిలో 16617, పతనంతిట్టలో 15618, కన్నూర్ లో 14147 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి కేరళలో 4,37,39,120 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ