దేశంలో కరోనా విజృంభణతో గతకొన్ని రోజులుగా 40 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 29,861 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 45,720 కరోనా పాజిటివ్ కేసులు, 1129 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 23, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా బాధితుల రికవరీ రేటు 63.18 శాతానికి పెరిగింది. అలాగే కరోనా మరణాల రేటు 2.41 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 23, ఉదయం 8 గంటల వరకు):
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 12,38,635
కొత్తగా నమోదైన కేసులు (జూలై 22 – జూలై 23 (8AM-8AM) : 45,720
నమోదైన మరణాలు : 1129
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 7,82,607
యాక్టీవ్ కేసులు : 4,26,167
మొత్తం మరణాల సంఖ్య : 29,861
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu