భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 90,123 పాజిటివ్ కేసులు, 1290 మరణాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ 16, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,20,359 కు, మరణాల సంఖ్య 82,066 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 39 లక్షలు దాటింది. ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో 82,961 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 39,42,360 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 78.5 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 16, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 5,94,29,115
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 50,20,359
- కొత్తగా నమోదైన కేసులు [సెప్టెంబర్ 15–సెప్టెంబర్ 16 (8AM-8AM)] : 90,123
- నమోదైన మరణాలు : 1290
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 39,42,360
- కరోనా రికవరీ రేటు: 78.5 %
- యాక్టీవ్ కేసులు : 9,95,933
- మొత్తం మరణాల సంఖ్య : 82,066
- కరోనా మరణాల రేటు: 1.6 %
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu