భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 85,362 పాజిటివ్ కేసులు నమోదవగా, 1089 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 59,03,932 కు, మరణాల సంఖ్య 93,379 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మరణాల రేటు 1.6 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
మరోవైపు గత 24 గంటల్లోనే 93420 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 48,49,584 కు చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో, రికవరీ రేటు 82.1 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల పరంగా అమెరికాను అధిగమించి భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 9,60,969 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu