దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 85,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కరోనా కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 93,420 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్తగా నమోదయిన కేసులలో దేశంలోని కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 75 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 75 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 17794
- కర్ణాటక – 8655
- ఆంధప్రదేశ్ – 7073
- కేరళ – 6477
- తమిళనాడు – 5679
- ఉత్తరప్రదేశ్ – 4256
- ఒడిశా – 4208
- ఢిల్లీ – 3827
- వెస్ట్ బెంగాల్ – 3190
- ఛత్తీస్ గడ్ – 2942
మరోవైపు గత 24 గంటల్లో 1089 మరణాలు నమోదవగా, దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 83 శాతం నమోదయ్యాయి.
1089 మరణాల్లో 83 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 416
- కర్ణాటక – 86
- ఉత్తరప్రదేశ్ – 84
- తమిళనాడు – 72
- పంజాబ్ – 68
- వెస్ట్ బెంగాల్ – 59
- ఆంధప్రదేశ్ – 48
- మధ్యప్రదేశ్ – 30
- ఛత్తీస్ గడ్ – 25
- ఢిల్లీ – 24
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu