భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 75829 పాజిటివ్ కేసులు నమోదవగా, 940 మంది మరణించారు. అక్టోబర్ 4, ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 65,49,373 కు, మరణాల సంఖ్య 1,01,782 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు ఒక్కరోజులోనే 82,260 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 55,09,966 కు చేరుకోవడంతో కరోనా రికవరీ రేటు 84.1 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.6 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 9,37,625 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu