దేశ రాజధాని ఢిల్లీ సహా నాలుగు ముఖ్యమైన నగరాల్లో కోవిడ్-19 కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 4.34 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 1,007 కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 299 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇది రెండు రోజుల క్రితం నమోదైన రోజువారీ సంఖ్యతో పోలిస్తే 118 శాతం పెరిగింది. గత రెండు రోజుల్లో, నగరంలో 501 కొత్త కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసుల సంఖ్య 814కి పెరిగింది. రోజువారీ హెల్త్ బులెటిన్ల ప్రకారం ఢిల్లీ-ఎన్సిఆర్ మరియు ముంబైలలో కోవిడ్ -19 కేసులు క్రమంగా పెరగడం ప్రారంభించాయి. ఢిల్లీ పొరుగున ఉన్న నోయిడా మరియు గురుగ్రామ్ లలో కూడా రోజువారీ కరోనా వైరస్ కేసుల్లో పెరుగుదల కనిపించింది. నిన్న గురుగ్రామ్ దాదాపు 40 రోజుల తర్వాత 128 కొత్త కోవిడ్-19 కేసులను నమోదు చేసింది.
నోయిడాలో పిల్లలకు కరోనా!
నోయిడాలో, పిల్లలు తరచుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నిన్న మరో 10 మంది చిన్నారులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. వారంలో మొత్తం 20 మంది విద్యార్థులు కోవిడ్-19 బారిన పడ్డారు. ఈ వారం ప్రారంభంలోనే అక్కడ 13 మంది పిల్లలు మరియు ముగ్గురు ఉపాధ్యాయులకు ఇన్ఫెక్షన్ సోకింది. పాఠశాలల్లో కూడా ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు మొగ్గు చూపుతున్నారు. ఇక ముంబైలో బుధవారం 73 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి – ఈ ఏడాది మార్చి 17 తర్వాత ఒక రోజులో అత్యధికం. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకారం, నగరంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది, సోమవారం 23 కేసులు మరియు మంగళవారం 52 నమోదయ్యాయి. అయితే, నగరంలో గత మూడు రోజుల్లో కోవిడ్ సంబంధిత మరణాలు ఏవీ నమోదు కాకపోవటం కొంత ఊరటనిచ్చే విషయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ